ఘోరం: మతం మారలేదని నడిరోడ్డుపై మర్డర్!

-

మహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలకు, దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పేర్లు చెప్పుకుంటూపోతే లిస్ట్ సభ్యసమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది! ప్రేమించడం లేదనో, మరో అవకాశం అడిగితే కాదందనో.. కారణం ఏమైనా బలవుతున్నది ఆడపిల్లే. తాజాగా హర్యాణాలో మరో అమ్మాయిని నడిరోడ్డుపై కాల్చేశారు దుర్మారులు!

అవును… తాజాగా హరియాణలో జరిగిన దారుణ ఘటన మహిళల భద్రతను సవాల్ చేస్తోంది. నిఖిత అనే 21 ఏళ్ల యువతి పరీక్ష రాసి వస్తుండగా, మాటు వేసిన ఇద్దరు దుర్మార్గులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డవగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బీకాం ఫైనల్ ఇయర్ విద్యార్థి నిఖితను కారులో కిడ్నాప్ చేయాలని ప్రయత్నించిన ఆమె స్నేహితుడుగా భావిస్తున్న తౌసీఫ్ ఎటాక్ చేశాడు. మొదట కారులో ఆమెను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్పులు జరిపగా.. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మతం మారేందుకు నిరాకరించిందన్న ఆగ్రహంతో ఆమెను చంపేసినట్లు తెలుస్తోంది!

Read more RELATED
Recommended to you

Latest news