ఏపీలో రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య..తలలు పగిలిపోయి మరీ !

-

ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెలినాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… తెనాలిలో రైల్వే ట్రాక్ పై యువతీ యువకుల అనుమానాస్పద స్థితి లో మృతదేహాలు పడి ఉన్నాయి. వారిద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

అంతేకాదు…వారు ప్రేమ జంట అని.. ఇంట్లో పెళ్లికి నిరాకరించారని.. ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే… తలలు పగిలిపోయి గుర్తించలేని స్థితిలో ఇద్దరి మృతదేహాలు…ఉండటంతో.. వారేవరోనని గుర్తు పట్టడం చాలా ఇబ్బందికి మారింది. పినపాడు – మల్లెపాడు మధ్య రైల్వే ట్రాక్ పై జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక యువతీ యువకుల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి.. పోస్టు మార్టం నిమిత్తం తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news