ఘోర విషాదం; 9 నెలలు కడుపున మోసి, పుట్టిన రెండు నెలల్లో చంపేసింది…!

-

ఈ విశ్వంలో వెల కట్టలేనిది ఏమైనా ఉందీ అంటే అది తల్లి ప్రేమే. తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఏ తల్లి అయినా సరే. జంతువులు కూడా తమ బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకుంటాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. చివరికి జాతి వైరం మర్చిపోయి కూడా కొన్ని జంతువులు చిన్న చిన్న పిల్లలను కాపాడుతూ ఉంటాయి. కాని ఒక తల్లి తన కూతురుని చంపి మ్యాన్ హోల్ లో పడేసింది.

పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. నగరంలోని బెలియాఘాట ప్రాంతంలో ఒక తల్లి తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేసారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన బిడ్డతో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి తన ఫ్లాట్‌లోకి ప్రవేశించాడని ఆమె ఆరోపించింది. తన బిడ్డతో పారిపోయిన తెలియని యువకుడు ఆమెను కొట్టాడని పోలీసులకు చెప్పింది.

దీనితో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఫ్లాట్ సెక్యూరిటీ గార్డు, బేబీ సిటర్ మరియు తల్లిని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ విచారణంలో పోలీసులు షాక్ అయ్యే సమాధానం వచ్చింది. తాను పాపను చంపి ఇంటి దగ్గరలో ఉన్న మ్యాన్ హోల్ లో పడేసా అని ఆమె సమాధానం ఇచ్చింది. దీనిపై స్పందించిన పోలీసులు అధికారి “శిశువు తల్లి అయిన మహిళ వాదనలలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి.

మేము ఆమెను ప్రశ్నించడం ప్రారంభించా౦. ఇది చాలా గంటలు కొనసాగింది, ఆ తర్వాత ఆమె నేరానికి పాల్పడినట్లు అంగీకరించింది. ఈ ప్రమాదానికి దారితీసిన ఆమె తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. మేము కూడా నిరాశాలోనే ఉన్నాం ఆమెను అరెస్టు చేశా౦ “అని ఐపిఎస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అయితే ఆ తల్లి ప్రసవానంతరం ఒక సమస్యతో బాధపడుతుందని అందుకే చంపేసిందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news