నా భర్తను చంపారు..రేపు నా బిడ్డను చంపుతారు – నీరజ్ సతీమణి సంజన

-

షాహీ నాథ్ గాంజ్ పరువు హత్యా కేసులో నీరజ్ సతీమణి సంజన సంచలన వ్యాఖ్యలు చేసింది. నా భర్త నీరజ్ ఎం తప్పు చేశాడనీ మా కజిన్ బ్రదర్ నీరజ్ ను చంపారు..మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా.. అని నిలదీశారు. నీరజ్ ను హత్యా చేసి కర్ణాటక గుడిమత్కల్ ప్రాంతానికి పరార్ అయిన నిందితులను ఉరి తీయాలని.. అప్పుడే నా బర్త ఆత్మకు శాంతి చేకూరుతుందని వెల్లడించారు.

ఇప్పుడు నా భర్తను హతమార్చారు, రేపు నా రెండు నెలల బాబును చంపుతారు. లేదంటే నా మామ అత్త లను ఎటాక్ చేస్తారని ఆరోపించారు. మేము ఇలా ఎన్ని రోజులు భయపడుతూ బ్రతకాలని.. నాకు న్యాయం జరగాలి. నా పేరెంట్స్ కజిన్ బ్రదర్ లా పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నా కుమారుణ్ణి చంపిన వారికి శిక్ష పడే వరకు నేను పోరాడుతానని నీరజ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఏడాది క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారని.. ఈ మధ్యకాలంలో నీరజ్ సంజన ఇద్దరు మాతోనే ఉంటున్నారన్నారు. ఇంతలోనే ఈ దారుణ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news