తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని రెండున్నరేళ్ల కూతురిపై హత్యాచారం చేసాడు యువకుడు. హత్యాచారం చేసిన ప్రియుడికి సహకరించింది చిన్నారి తల్లి. మహారాష్ట్ర – మాల్వనీ ప్రాంతంలో భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రుల వద్ద 30 ఏళ్ల మహిళ ఉంటోంది. అనంతరం 19 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది మహిళ. ఈ క్రమంలో మహిళ ఇంటికి వెళ్లి, ఆ మహిళ కూతురు(రెండున్నరేళ్లు)పై హత్యాచారం చేసాడు యువకుడు.
కన్న కూతురిపై హత్యాచారం చేస్తున్నా చూస్తూ సహకరించింది కానీ అడ్డుపడలేదు తల్లి. ఈ యువకుడి చేతిలో అత్యాచారానికి గురై కాసేపటికి ప్రాణాలు విడిచింది పసిపాప.. అయితే పాప మూర్ఛపోయి పడిపోయిందని ఆసుపత్రికి తీసుకెల్లింది తల్లి. అప్పటికే పాప మృతి చెందిందని నిర్దారించారు వైద్యులు.. పాపకు పోస్ట్మార్టం చేయగా, ప్రైవేట్ పార్ట్స్పై గాయాలు కనిపించాయ్. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. విచారణలో పాపపై ప్రియుడు హత్యాచారం చేశాడని ఒప్పుకుంది తల్లి. ప్రియుడిపై, తల్లిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.