వేధింపులు తాళ‌లేక అర్చ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

-


అమ‌రావ‌తి(కణుపూరు): తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కణుపూరు మల్లికార్జునస్వామి ఆలయంలో మల్లికార్జున శర్మ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ఆలయంలో గుప్తనిధులు తవ్వకం కోసం సహకరించాలంటూ ధ‌ర్మకర్తల మండలి సభ్యులు ఆయన్ని కొంతకాలంగా వేధిస్తున్నారు. వారి ఒత్తిడి భరించలేని శర్మ సెల్‌ఫోన్‌లో తన ఆవేదనను వెల్లడించాడు. తనను ఇబ్బందులకు గురిచేసిన వారి పేర్లను వెల్లడించి పురుగుల మందు తాగాడు. స్థానికులు ఆయన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా… అక్కడ చికిత్స పొందుతూ బుధ‌వారం ఉదయం ప్రాణాలొదిలాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version