షాకింగ్; 1500 కోసం తల్లిని, తండ్రిని, తమ్ముడ్ని చంపేసాడు…!

-

1500 రూపాయల విషయంలో ఒక యువకుడు తల్లిని, తండ్రిని తమ్ముడిని హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జనవరి 24 న, మైనర్ తన తల్లి నుండి 1,500 రూపాయలు డిమాండ్ చేసాడు. దీనికి ఆమె నిరాకరించడంతో, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మైనర్… వెంటనే తన తల్లి గొంతు కోసి చంపాడు.

తన తల్లి ఇంకా బతికే ఉందని అనుమానించిన మైనర్ అప్పుడు తండ్రికి ఉన్న లైసెన్స్ తుపాకీని తీసుకొని తల్లిని కాల్చి చంపాడు. తన తల్లిని చంపిన తరువాత, విషయం తెలుసుకుని ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన తండ్రిపై రెండు బుల్లెట్లను కాల్చాడు. దీనితో అతను కూడా మరణించాడు. ఇక తన తమ్ముడు అడ్డు పడగా… ఆ బాలుడ్ని కూడా గొంతు కోసి చంపి మూడు మృతదేహాలను ఇంట్లో పెట్టి తాళం వేసాడు.

సమాచారం అందుకున్న పోలీసులు అతని కోసం గాలించి అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మైనర్ తన 18 వ పుట్టినరోజుకు ఏడు నెలల తక్కువ. మాక్రోనియాలోని ఒక దుకాణంలో సిమ్ కార్డు కొనడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనకు తాను బాధత వహిస్తా అని ఒక లేఖ కూడా రాసాడు ఆ బాలుడు.

Read more RELATED
Recommended to you

Latest news