గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో అప‌శృతి.. క‌రెంట్ షాక్‌తో విద్యార్థి మృతి

-

దేశ వ్యాప్తంగా బుధ వారం గ‌ణ‌తంత్ర వేడుక‌లు అంగ‌రంగ వైభంగా జ‌రిగాయి. కానీ బిహార్ లోని బక్స‌ర్ ఒక‌ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో విషాదం చోటు చేసుకుంది. గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో పాల్గొన్న విద్యార్థి మృతి చెందాడు. కాగ ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న బిహార్ లోని బక్స్ జిల్లా ఇటాడి బ్లాక్ లో గ‌ల నాథాపూర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చోటు చేసుకుంది. అయితే బుధ వారం నాథాపూర్ ప్ర‌భుత్వ‌ ప్రైమ‌రీ పాఠ‌శాల‌లో గ‌ణ‌తంత్ర దినోత్స వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెండా ఎగ‌ర‌వేస్తున్న ప్ర‌మాద‌వ శాత్తు స‌మ‌యంలో పక్కనే ఉన్న హై వోల్టేజ్ క‌రెంటు వైర్ ఇనుమ స్థూపానికి త‌గిలింది. దీంతో ఆ ఇనుప స్థూపం వ‌ద్ద ఉన్న నలుగురు విద్యార్థుల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు, స్థానికులు గాయ ప‌డ్డ న‌లుగురిని ద‌గ్గ‌ర్లో ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న శుభంక‌మార్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. దీంతో గ‌ణ‌తంద్ర దినోత్సవం వేడుక‌ల్లోనే అప‌శృతి జ‌రిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version