ఆర్మీ క్యాంప్​పై ఆత్మాహుతి దాడి.. ముగ్గురు జవాన్లు మృతి.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

-

జమ్ముకశ్మీర్ రజౌరీ వద్ద తెల్లవారుజామున ఘోరం జరిగింది. సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ముష్కరులు మరణించారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు. ఘటనకు సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.

దర్హల్ ప్రాంతంలోని పర్గల్​లోని సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. గురువారం వేకువజామున ఆర్మీ క్యాంప్​ ఫెన్సింగ్​ దాటుకుని లోపలకు చొరబడేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. వారిపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య చాలాసేపు హోరాహోరీ పోరు జరిగింది. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

హతమైన ముష్కరుల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు తెలిసింది. చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారన్న అనుమానంతో భద్రతా సిబ్బంది విస్తృత సోదాలు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news