నాగ‌ర్ క‌ర్నూల్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

-

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. కాగ జిల్లా లోని క‌ల్వ‌కుర్తి మండ‌లం లో గల మాచ‌ర్ల స‌మీపంలో ఈ రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మాచ‌ర్ల వ‌ద్ద ర‌హ‌దారిపై ఒక కారు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

స్థానికులు పోలీసులు స‌మాచారం అందించారు. దీంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఈ కారు ప్ర‌మాదంలో మృతి చెందిన ముగ్గురు కూడా న‌ల్గొండ జిల్లా లోని మిర్యాలగూడ మండ‌ల వాసులుగా పోలీసులు గుర్తించారు. అనంత‌రం పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు. అలాగే ముగ్గురు మృత దేహాల‌ను ద‌గ్గ‌ర్లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందిచ‌డానికి పోలీసులు ప్ర‌యత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version