అత్యాచారం చేసి.. ఆపై కిరోసిన్ పోసి..!

-

పాట్నా: దేశవ్యాప్తం అత్యాచార కేసుల సంఖ్య పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల ఆగడాలు అరికట్టలేకపోతున్నాయి. 12 ఏళ్ల బాలికను కొందరు ఆగంతకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆ బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఇలాంటి అమానుష ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.

RAPE
RAPE

బిహార్‌ తూర్పు చంపారన్ జిల్లా మోతిహరీ గ్రామంలో గత నెల 21వ తేదీన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేపాల్‌కు చెందిన ఓ కుటుంబం మోతిహరీ గ్రామంలో నివాసముంటోంది. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అది గమనించిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు విగతజీవిగా పడిఉన్న బాలికను ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది.

బాలిక చనిపోయిందని తెలుసుకున్న నిందితులు.. మృతదేహాన్ని వెంటనే దహనం చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించి.. బాలిక మృతదేహాన్ని కిరోసిన్ పోసి నిప్పంటించారు. అనంతరం సాక్ష్యాధారాలు లభించకుండా చుట్టూ ఉప్పును చల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే బాధితురాలి తండ్రి హత్యాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. కేసు నమోదు చేసేందుకు నిరాకరించారన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌ని విధుల నుంచి బహిష్కరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 11 మంది నిందితులను గుర్తించి.. వీరిలో నలుగురిపై సామూహిక అత్యాచార అభియోగం మోపారు. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశామని.. మిగిలిన వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష అమలు అయ్యేలా చూస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news