భర్తకు భార్య వార్నింగ్.. అత్తామామల న్యూడ్ వీడియోలు వైరల్ చేస్తానంటూ బ్లాక్​మెయిల్​

-

దిల్లీలోని లక్ష్మీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ ఆభరణాల వ్యాపారికి తన భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఒకే ఇంట్లో ఉన్నా వారిద్దరు వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసింది. తన బండారం బయటపడటంతో ఆ మహిళ ఇంట్లో ఉన్న కోటికి పైగా విలువైన ఆభరణాలు, డబ్బు తీసుకుని పారిపోయింది.

ఈ విషయంపై ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఆమె తన భర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. తనపై కేసు వెనక్కి తీసుకోకపోతే భర్త తల్లిదండ్రుల న్యూడ్ వీడియోలు వైరల్ చేస్తానని బ్లాక్​ మెయిల్ చేయడం ప్రారంభించింది. తాను వారింట్లో ఉన్నప్పుడు అత్తామామకు తెలియకుండా వారి గదిలో కెమెరాలు పెట్టినట్లు చెప్పింది. వెంటనే ఆ వ్యాపారి ఈ విషయంపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాపారి భార్యను, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version