పెళ్లయి ఐదేళ్లు అయినా పిల్లలు పుట్టలేదని…

-

ఓ మహిళ.. తనకు పెళ్లయి ఐదేళ్లు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదని అఘాయిత్యం చేసుకున్నది. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో చోటు చేసుకున్నది. 23 ఏళ్ల మాధవికి ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే ఆమెకు ఇప్పటి వరకు పిల్లలు కలుగలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. రోజూ మధన పడుతుండేది. మానసికంగా బాగా దెబ్బతిన్న మాధవి… పిల్లలు లేని బతుకు వేస్ట్ అనుకుంది. దీంతో రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మాధవి ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మాధవి మృతిని తట్టుకోలేక.. ఆమె తండ్రి ఆమె మృతదేహం వద్ద బోరున విలపించిన తీరును చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version