భర్త ఇంట్లో ఉండగానే.. అత్తమామలను హత్య చేసిన కోడలు

-

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రస్తుత్తం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ.. ఓ కోడలు ఇంట్లో ఉన్న అత్తమామలను హత్య చేసింది. భర్త ఇంట్లో ఉన్న సమయంలోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. వివరాల్లోకి వెళితే.. ప‌శ్చిమ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో రాజ్‌ సింగ్ ‌(61), ఓంవతి (58) అనే వృద్ధ‌ దంప‌తులు కొడుకు, కోడ‌లుతో క‌లిసి నివసిస్తున్నారు. అయితే శుక్రవారం కోడలు కవితకు(35) ఆమె అత్తమామలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో కవిత ఆవేశంతో వారిని పొడిచి చంపేసింది.

 

కవిత తన అత్తమామలను హత్య చేసినట్టుగా ఉదయం 11.00 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. దీంతో 11.15 గంటలకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోని ఓ బెడ్ రూమ్‌లో మృతదేహాలను గుర్తించారు. వారి ముఖాలపై పదునైన కత్తిగాట్లు ఉన్నట్టు కనుగొన్నారు. అయితే హత్య జరిగిన సమయంలో కవిత భర్త సతీష్ సింగ్(37) కూడా ఇంట్లోనే ఉండటంతో.. ఈ నేరంలో అతని పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

వృద్ధ దంపతుల హత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కవిత, ఆమె భర్తలను విచారిస్తున్నారు. అయితే ఆస్తి తగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణ ఆధారంగా తెలుస్తోంది. కాగా, కవిత, సతీష్ సింగ్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరి వయసు 6 ఏళ్లు, మరోకరిది 8 ఏళ్లు.

Read more RELATED
Recommended to you

Latest news