బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ పేలి యువకుడి మృతి

-

రాజస్థాన్ రాష్ట్రంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. చెవిలో పెట్టుకున్న బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ఒక్కసారిగా పేలిపోవడంతో 28ఏండ్ల యువకుడు మృతిచెందాడు.

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ జిల్లా చోము టౌన్‌కు సమీపంలోని ఉదయ్‌పురియా గ్రామానికి చెందిన రాఖేశ్ కుమార్ నాగర్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. పవర్ బ్యాంక్‌కు అనుసంధానం చేసి హెడ్‌ఫోన్స్ వినియోగించడంతో ఒక్కసారిగా అవి పేలిపోయాయి. రాహుల్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. రెండు చెవులకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో బాధితుడిని హాస్పిటల్‌కు తీసుకువచ్చారని, చికిత్స పొందుతూ మృతిచెందాడని సిద్ధివినాయక హాస్పిటల్ డాక్టర్ ఆర్‌ఎల్‌ఎన్ రుండ్ల తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version