త్రిపుర సీఎంపై మర్డర్ ఎటాక్.. తృటిలో తప్పిన ప్రమాదం

-

త్రిపురు సీఎం బిప్లర్‌ కుమార్‌ దేవ్‌ పై మర్డర్‌ ఎటాక్‌ చోటు చేసుకుంది. ఆయనను కారుతో ఢీ కొట్టేందుకు ప్రయత్నించగా.. సీఎం సీఎం బిప్లర్‌ కుమార్‌ దేవ్‌ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. గురువారం జరిగిన ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల ప్రకారం.. బిప్లవ్‌ దేవ్‌ గురువారం సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు బయటకు వచ్చారు.

తన అధికారిక నివాసానికి సమీపంలో సీఎం వాకింగ్‌ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కారు నడపుకుంటూ భద్రతా వలయంలోకి దూసుకొచ్చారు. వాహనాన్ని గమనించిన సీఎం.. వెంటనే పక్కకు జరుగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సీఎం సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. తాజాగా ఇవాళ ఆ నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు నిందితులు. అసలు వారు ఈ దాడికి దిగడానికి కారణాలేంటి ? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version