వేయి స్తంభాల ఆలయంలో నెలకొన్న భక్తుల రద్దీ

-

హన్మకొండ నగరంలో వేయిస్థంబాల దేవాలయంలో ఈ రోజు భక్తుల సందడి నెలకొంది. సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి రుద్రేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే స్వామికి మొక్కులు చెల్లించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news