టెక్కీకి న్యూడ్ కాల్ చేసింది.. రూ.25 లక్షలు లాగేసింది

-

సైబర్ మోసగాళ్ల వలలో పడి రూ.25లక్షలు పోగొట్టుకున్నాడు ఒడిశాకు చెందిన ఓ ఇంజినీర్. సమాజానికి భయపడి తొలుత మౌనంగా ఉండిపోయిన అతడు.. తనకు న్యాయం చేయాలంటూ ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు.

బాధితుడు.. భువనేశ్వర్​లో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్​ఎన్​ఎల్​లో ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్​లో ఓ మెసేజ్ వచ్చింది. ఈ సందేశం ఎవరు పంపారా అని ఆలోచిస్తుండగానే వీడియో కాల్ వచ్చింది. ఆన్సర్ చేసి చూస్తే.. అవతలి వైపున ఓ మహిళ నగ్నంగా ఉంది. ఏవేవో కబుర్లు చెబుతోంది. వెంటనే కాల్ కట్ చేశాడు ఆ ఇంజినీర్.

అప్పటికే రికార్డ్ అయిన వాట్సాప్ వీడియో కాల్​ను దోపిడీకి అస్త్రంగా మలుచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. నగ్నంగా ఉన్న మహిళతో ఇంజినీర్ మాట్లాడుతున్న వీడియోను మార్ఫ్​ చేశారు. రూ.25లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. సమాజంలో తన ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని భయపడిన ఇంజినీర్.. వారు అడిగిన డబ్బు సమర్పించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై భువనేశ్వర్​లోని సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news