రేవంత్ దావోస్ వేదికపై అన్ని అబద్దాలే చెప్పారు : దాసోజు శ్రవణ్

-

రేవంత్ దావోస్ వేదికపై అన్ని అబద్దాలే చెప్పారు అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది. అబద్దాల పునాదుల మీద రేవంత్ రాజకీయం చేస్తున్నారు. అహంకారమే ఆభరణం గా రేవంత్ పని చేస్తున్నారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ చిల్లర ధోరణి మారడం లేదు.  రాష్ట్ర ప్రతిష్ట ను పెంచుకోవడం కంటే కూడా వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి రేవంత్ తాపత్రయ పడ్డారు.

రైతుల ఆత్మహత్యల పై అంతర్జాతీయ నేతలను తప్పు దోవ పట్టించారు.రైతు భరోసా తో పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నట్టు తప్పుడు మాటలు చెప్పారు. రేవంత్ ఓ సన్నాసి ..కే టీ ఆర్ అంతటి నేతను పట్టుకుని డుప్లి కేట్ ఆంటారా..? అదానీ గురించి రాహుల్ పార్లమెంటు లో రోజుల తరబడి గంటల కొద్దీ విమర్శలు చేశారు ..దేశాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. అదానీ వ్యవహారాల పై రాహుల్ కొట్లాడారు ..జేపీసీ ,సిబిఐ ,ఈడీ విచారణకు డిమాండ్ చేశారు. మోడీ అదానీ విమానం లో కలిసి ప్రయాణం చేసిన ఫోటో ను కూడా రాహుల్ విడుదల చేశారు.

ఢిల్లీలో అదానీ తో కుస్తీ దావోస్ లో దోస్తీ యా. రేవంత్ మోడీ ని కలిసిన తర్వాత ఆదానీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారా.? రాహుల్ ఆదానీ ని తిట్టడమేమిటి ?రేవంత్ ఆయన తో 12 వేల కోట్ల రూపాయల తో ఒప్పందం కుదుర్చుకోవడమేమిటి ? అదానీ తో కుదుర్చుకున్న ఒప్పందం లో రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటు ఉంది. అదానీకి రక్షణ రంగం పరిశ్రమల స్థాపన లో ఏం అనుభవం ఉందని రాహుల్ యే స్వయంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news