రక్షాబంధన్ రోజు బస్సులో ఉచిత ప్రయాణం!

-

ఆగస్టు 26 అనగా ఆదివారం రక్షాబంధన్ రోజున ఢిల్లీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ఢిల్లీ రవాణా కార్పొరేషన్ (డీటీసీ) కల్పిస్తుంది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీ, నాన్ ఏసీ తేడా లేకుండా ఏ బస్సులోనైనా మహిళలు ఉచితంగానే ప్రయాణించే అవకాశం కల్పిస్తూ డీటీసీ నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల రద్దీని దృష్ట్యా బస్సుల సంఖ్యను మరింత పెంచనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఢిల్లీ మెట్రో మరిన్ని ట్రిప్పులను అందుబాటులో ఉంచాలని భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news