Pro Kabaddi 2019: జైపూర్ పై ఢిల్లీ, గుజరాత్ పై పునేరి గెలుపు

-

ఆగస్టు 7 న యూపీ యోధా, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య ఒక మ్యాచ్, పాట్నా పైరేట్స్, హర్యానా స్టీలర్స్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది.

ప్రో కబడ్డీ 2019 సీజన్ 7 రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే 28 మ్యాచులు పూర్తయ్యాయి. నిన్న పాట్నాలోని ఇండోర్ స్టేడియంలో రెండు మ్యాచులు జరిగాయి.

23వ మ్యాచ్ రాత్రి 7.30 కు దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగింది. ఈ పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ ను దబాంగ్ ఢిల్లీ 35 – 24 తేడాతో ఓడించింది.

24వ మ్యాచ్ గుజరాత్, పునేరి మధ్య జరగింది. రాత్రి 8.30 కు ఈ మ్యాచ్ ప్రారంభం కాగా… ఈ పోరులో గుజరాత్ ను 33 – 31 తేడాతో పునేరి ఓడించింది.

ఇవాళ మ్యాచులేవీ లేవు. రేపు.. అంటే ఆగస్టు 7 న యూపీ యోధా, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య ఒక మ్యాచ్, పాట్నా పైరేట్స్, హర్యానా స్టీలర్స్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news