కంటతడి పెట్టుకున్న డిప్యూటీ సీఎం.. చూడలేక కూతురు కూడా..!

-

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కంటతడి పెట్టుకున్నారు. సోమవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు అగ్రకులాల నేతల తనపై చేసిన మాటలు బాగా కలిగించాలని ఎమోషనల్ అయిపోయారు. తండ్రి కంటతడి పెట్టుకోవడంతో అదే కార్యక్రమంలో ఉన్న డిప్యూటీ సీఎం కూతురు కృపా లక్ష్మి కూడా కంటతడి పెట్టుకున్నారు. చేసే పనిలో మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడద్దని ధైర్యంగా ఉండాలని కూతురు కృపా లక్ష్మిని నారాయణస్వామి ఓదార్చారు.

ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని నేతలు కార్యకర్తలు అంతా మాకు సమానమని అన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఆయన, కూతురు కంటతడి పెట్టుకోవడంతో కార్యక్రమానికి హాజరైన పలువురు కార్యకర్తలు కూడా ఎమోషనల్ అయ్యారు ఇటీవల వైసిపి అభ్యర్థులు ఇన్చార్జిలా మార్పులు చేర్పులు చేపట్టిన జగన్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టేసారు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని గంగాధర అసెంబ్లీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణ స్వామికి టికెట్ కష్టమని జోరుగా ప్రచారం సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news