ఎయిర్ఇండియాపై భారీ జరిమానా విధించిన డీజీసీఏ

-

ఎయిర్ ఇండియా సంస్థకి బిగ్ షాక్ తగిలింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియా సంస్థపై ఫైన్ వేసింది. విశ్రాంతి ఇవ్వకుండా పైలట్లకు డ్యూటీలు వేస్తూ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ మరియు ఫెటీగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ రెగ్యులేషన్స్ అతిక్రమించినందుకు రూ.80లక్షల భారీ జరిమానా విధించింది.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇండియా విమానంలో అడిట్ నిర్వహించింది. ఆ సమయంలో ఇద్దరు పైలట్లు 60 ఏళ్ళకి మించి వయసున్న వారు ఉన్నారని తేలింది. అంతేకాదు పైలట్ల డ్యూటీ, ట్రిప్‌ల తర్వాత, ముందు విశ్రాంతి ఇచ్చే విషయంల్లో నియమ నిబంధనలు పాటించ లేదని DGCA రూ.80లక్షలు ఫైన్ విధించింది. సివిల్ ఏవియేషన్ భద్రత పెంచడానికి కఠిన చర్యలు తీసుకుంటామని DGCA వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news