నిందితుడు రాజు ఆత్మహత్యపై తెలంగాణ డిజిపి కీలక ప్రకటన..

-

సైదాబాద్ ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్యపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజు సూసైడ్ పై ఎలాంటి వదంతులు నమ్మవద్దని… రాజు ఆత్మహత్య చేసుకుంటుండగా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాజు ఆత్మహత్య చేసుకునే సమయంలో ఏకంగా ఏడుగురు మంది సాక్షులు ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు.

వరంగల్ నుంచి వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి ఇద్దరు డ్రైవర్లు, ముగ్గురు రైతులు మరియు ఇద్దరు రైల్వే గ్యాంగ్ మెన్లు సాక్షులుగా ఈ కేసులో ఉన్నారు అని స్పష్టం చేశారు డిజిపి. వారి స్టేట్మెంట్ను రికార్డు చేశామని పేర్కొన్న డీజీపీ మహేందర్ రెడ్డి…. రాజు ఆత్మహత్య పై ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటేనే మాట్లాడాలని చురకలంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news