రాజును రక్షించిన కామారెడ్డి పోలీస్ అధికారులను అభినందించిన డిజిపి మహేందర్ రెడ్డి

-

రాజును రక్షించిన కామరెడ్డి పోలీస్ అధికారులను అభినందించారు డిజిపి మహేందర్ రెడ్డి. కామారెడ్డి జిల్లాలో మంగళవారం వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుపోయిన వ్యక్తిని సురక్షితంగా రక్షించడంలో కీలక పాత్ర వహించిన కామారెడ్డి పోలీస్ సూపరింటెండ్ తోపాటు సంబంధిత పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులను డిజిపి ఎం. మహేందర్ రెడ్డి అభినందించారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడో రాజు రాళ్లపై నుంచి వెళ్తుండగా సెల్‌ఫోన్‌ పడిపోయింది.

దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. మంగళవారం సాయంత్రం ఇరుక్కుపోగా.. బుధవారం నుంచి సహాయక చర్యలు చేపట్టారు. కాగా నేడు ఉదయం నుంచి రెండు జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో బండరాళ్లను తొలగించి సురక్షితంగా రక్షించడంలో కీలక పాత్ర వహించిన జిల్లా ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి, ఇతర పోలీస్ అధికారులతోపాటు అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు, ఇందుకు సహాయ పడిన స్థానిక పౌరులను డిజిపి మహేందర్ రెడ్డి అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news