ఐపీఎల్ లో ధోనీ ఓపెనింగ్ చేయొచ్చు: మాజీ క్రికెటర్ వెంకటేశ్

-

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అంతా మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఎమ్ఎస్ చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరుగనుంది. అయితే, సీజన్ ప్రారంభం వేళ చెన్నై అభిమానులను ధోని కలవరపాటుకు గురిచేశారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ కొత్త సీజన్, “కొత్త పాత్ర” కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. దీని గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తా’ అని పేర్కొన్నారు.

ఈ పోస్ట్ పై మాజీ క్రికెటర్ సి. వెంకటేశ్ స్పందించారు.’నా అంచనా ప్రకారం అతడు రుతురాజ్తో కలిసి ఓపెనింగ్ చేయొచ్చు అభిప్రాయం వ్యక్తం చేశారు. పవర్ ప్లే ఓవర్లను పూర్తిగా ఉపయోగించుకోవడానికి ధోనీ ఈ వ్యూహం అమలు చేయొచ్చు’ అని వెంకటేశ్ ట్వీట్ చేశారు. మరి ధోనీ కొత్త పాత్రపై మీరేమనుకుంటున్నారు.. కామెంట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news