ధోని భార్య సాక్షికి క్లాస్ పీకిన ఫ్యాన్స్‌..! ఎందుకంటే..?

-

ఇండియన్ క్రికెట్ టీం వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, అతని భార్య సాక్షి ధోని చూడ చక్కని జంటలా ఉంటారు. ఏ ఫంక్షన్‌కు వెళ్లినా, బయటకు వెళ్లినా కలిసే ఉంటారు. ఇక వారి గారాల పట్టి జీవా కూడా వారితోపాటే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ జంట ఓ ఫంక్షన్‌కు వెళ్లింది. కానీ ఆ ఫంక్షన్‌కు ధోని భార్య సాక్షి వేసుకు వచ్చిన డ్రెస్ చూసి ఇప్పుడు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.

ధోని తన భార్య సాక్షితో కలిసి ఇటీవలే ఓ ఫంక్షన్‌కు హాజరయ్యాడు. వారితోపాటు తమ కూతురు జీవా కూడా ఉంది. అయితే ఆ ఫంక్షన్‌కు సాక్షి వేసుకువచ్చిన డ్రెస్ క్లీవేజ్ తరహాలో ఉంది. దీంతో ఆమె ధోని ఫ్యాన్స్‌చే విమర్శల పాలవుతోంది.

ధోని భార్యవు అయి ఉండి అలాంటి డ్రెస్ వేసుకువచ్చావేంటి, మంచి డ్రెస్ వేసుకోలేవా, చెత్త డ్రెస్.. అంటూ కొందరు ట్విట్టర్‌లో కామెంట్లు చేశారు. అయితే మరికొందరు మాత్రం సాక్షికి మద్దతుగా నిలిచారు. తన డ్రెస్, తన ఇష్టం, మధ్యలో మీరెవరు చెప్పడానికి, నచ్చకపోతే చూడకండి.. అంటూ కొందరు సాక్షికి అండగా నిలిచారు. అయితే సాక్షి మాత్రం ఇవేవీ పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news