ప్రభాస్ నటించిన తాజా చిత్రం స్పిరిట్. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ డ్యూటీ దీపిక పదుకొనేను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలు వల్ల ఈ బ్యూటీని తొలగించారు. దానికి గల ప్రధాన కారణం దీపిక ఈ సినిమాలో నటించిన భారీగా డబ్బులను డిమాండ్ చేసిందట. అంతే కాకుండా 35 రోజుల సినిమా షూటింగ్ కోసం 25 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటుగా సినిమా లాభాలలో 10% వాటాను అడిగినట్లుగా సమాచారం అందుతుంది.

అలాగే ఈ సినిమాలో తెలుగు డైలాగ్స్ చెప్పడానికి దీపికా పదుకొనే నో చెప్పిందట. ఇవన్నీ దీపిక డిమాండ్ చేయడంతో సందీప్ రెడ్డికి విపరీతంగా కోపం వచ్చి ఆమె స్థానంలో బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రిని ఎంపిక చేశారు. అంతేకాకుండా సినిమా కథ పూర్తిగా విన్న తర్వాత దీపిక ఇలా డిమాండ్ చేయడంతో సందీప్ రెడ్డి వంగాకు తనపై చాలా కోపం చిరాకు వచ్చిందట. వెంటనే ఆమెను సినిమాలో నటించడం అవసరం లేదని డైరెక్ట్ గా చెప్పేసారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది.