ఆ రూమర్లకు సితార ఎంటర్ టైన్మెంట్ చెక్ పెట్టినట్లేనా…?

-

తెలుగుసినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుస విజయాలు అందుకుంటూ ముందుకు సాగిపోతోన్న నిర్మాతలలో మనకు చినాబాబు కనిపిస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో టై అప్ అయిన దగ్గరినుంచి ఈయన బ్యానర్లో వచ్చే సినిమాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అంటే చాలు
డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు కొనే స్థాయికి వెళ్లిపోయారు.త్రివిక్రమ్ చేసే వరుస సినిమాలు ఈ బ్యానర్లోనే వస్తూ ఉండడంతో అటు మెగా కాంపౌండ్ మనిషిగాను నోటెడ్ అయిపోయారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో నిర్మాత చిన బాబు ఎలాంటి ఫిల్మీ వండర్స్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం.కుమారుడు నాగవంశీని ప్రొడ్యూసర్ గా పెట్టి సితార ఎంటర్ టైన్ మెంట్ రన్ చేస్తున్నారు.మొన్నటివరకు ఈ బ్యానర్లో వచ్చే సినిమాలలో హీరోలుగా మెగా అండ్ కో బ్యాచ్ మాత్రమే ఉంటుందని ప్రచారం జరిగింది.ఐతే తాజా లెక్కలతో అవన్ని ఒట్టి ట్రాష్ అని తెలిసిపోయింది.

త్రివిక్రమ్ ,పవన్ కళ్యాణ్ లకు అనుకూలంగా ఉండే హీరోలతోనే సితార వారు సినిమాలు చేస్తారనే అపవాదు ఆ మధ్య వచ్చింది. అందుకు తగ్గట్లుగానే వీరి బ్యానర్లో చేసే హీరోలు ఆయా కాంపౌండ్ లకు మద్దతుదారులు కావడంతో ఈ కామెంట్స్ కు బలం చేకూరింది.నితిన్ కు నిన్న భీష్మ,నేడు రంగ్ దే సినిమాలిచ్చి ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు అనేవారు ఉన్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విమల్ కృష్ణ అనే డైరెక్టర్ తో ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. ‘గుంటూరు టాకీస్’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. క్రైమ్ కామెడీగా రానున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.సినిమా విషయంలో క్రియేటివ్ డైరెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడనే పేరున్న నాగవంశీ..ఈ సినిమాతో త్రివిక్రమ్ అండ్ మెగా కాంపౌండ్ లతో అంతగా రిలేటెడ్ కాని అవుట్ సైడ్ పర్సన్ ను హీరోగా పెట్టి సినిమాలు తీస్తూ ఉండడం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news