ప్రొడ్యూసర్ దిల్ రాజు డబుల్ గేమ్..!!

-

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు దారుణ మైన దెబ్బ పడబోతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్  వర్గాలు. దిల్ రాజు స్టార్ హీరో దళపతి విజయ్ డేట్స్ సంపాదించి , మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా నిర్మిస్తున్నారు.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

హీరో విజయ్ కి వున్న  రెండు రాష్ట్రాల్లో వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతికి కానుక గా  జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది. అయితే సంక్రాంతికి బాలయ్య బాబు వీర సింహ రెడ్డి గా, చిరంజీవి వాల్తేరు వీరయ్య గా వస్తున్నారు.అయితే  దిల్ రాజు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ అతనికే దెబ్బ తగిలేలా చేస్తోంది.

గత సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలను ఆడనివ్వమని తెలుగు సినిమాలకు ప్రాధాన్యతనిచ్చాకే ప్రాధాన్యతా క్రమంలో చివరిలో అనువాద చిత్రాలకు థియేటర్లు ఇచ్చేలా రూల్ ని పాస్ చేసారు. దీంతో దానిని 2023 సంక్రాంతికి కూడా ఇదే ఉండాలని  ఛాంబర్ పెద్దలు కూడా అధికారికంగా నోటీస్ పంపారు. దీనితో ఆయన డబ్బింగ్ సినిమా వారసుడు ఆగే పరిస్థితి ఏర్పడింది. ఒక సారి నిర్మాతల సినిమాలు బంద్ చేసినప్పుడు ఇదే సినిమాని తమిళ సినిమా గా చెప్పి షూటింగ్ పూర్తి చేసాడు. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ సినిమా ను సంక్రాంతికి రానివ్వకుండా చేస్తున్నారని  టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. ఇలా డబల్ గేమ్ తో దిల్ రాజు ఇప్పుడు తానే ఇబ్బంది పడుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news