క్రైమ్ థ్రిల్ల‌ర్ గా పీఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ నెం.1

-

మణిరాజ్‌ డైరెక్షన్‌ లో పీఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ నెం.1 షూటింగ్‌ పూర్తి అయింది. పృథ్విరాజ్‌, అనూ మెహ‌త హీరోహీరోయిన్లుగా పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాబ‌రీ నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఓ క్రొత్త చిత్రం రూపొందుతోంది. పృథ్విరాజ్‌, అనూ మెహ‌త హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి స‌మ‌ర్ఫ‌ణ‌ పి. నాగ‌మ‌ణి,బ్యాన‌ర్ పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ వ్యవహరిస్తోంది. నిర్మాత‌గా ప్ర‌వీణ శివరాజ్,
ద‌ర్శక‌త్వం పి. మ‌ణిరాజ్ వహిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫిగా ప‌ర‌శురామ్‌ ఎరుగ‌దిండి, ఎడిట‌ర్‌ గా సి. అక్ష‌య‌రాజ్‌, పీఆర్ఓ గా శ్రీ‌ను-సిద్ధు ఉన్నారు.

కొత్త త‌ర‌హా క‌థ‌, క‌థనంతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి ఓ ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇప్ప‌టికే మొద‌లైన ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయనున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు పి. మ‌ణిరాజ్ మాట్లాడుతూ – “27 రోజుల పాటు వికారాబాద్‌, హైద‌రాబాద్ మ‌రియు ప‌రిసర ప్రాంతాల్లోని అంద‌మైన లోకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. హీరో పృథ్విరాజ్‌, హీరోయిన్ అనూ మోమ‌త చక్క‌గా న‌టించారు. టెక్నీషియ‌న్స్ అంద‌రూ పూర్తి స‌హ‌కారం అందించారు. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి. ఒక రాబ‌రీ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి న‌వంబ‌రు నెల‌లో రిలీజ్ చేయడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. త్వ‌ర‌లోనే టైటిల్‌, ఫ‌స్ట్ విడుద‌ల చేస్తాం“ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version