ఆ స్టార్ హీరో కోసం RC 15 సినిమాను ఆపేసిన డైరెక్టర్ శంకర్.. కారణం..?

-

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన 15 సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసింది. ఇక మొన్నటి వరకు షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ భారీ రియాల్టీ సెట్ ల మధ్య 50 శాతానికి పైగా పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే క్లైమాక్స్ పార్ట్ ను షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఇందుకోసం ఏకంగా రూ. 20 కోట్ల పైనే బడ్జెట్ ను కేటాయించారు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఒక స్పెషల్ సాంగ్ కోసం షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.ఇందుకు కారణం ఇండియన్ 2 మూవీ ని మళ్ళీ మొదలు పెట్టబోతున్నాడు అని సమాచారం. కమలహాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దీనిని ఇప్పుడు పునః ప్రారంభించబోతున్నారని.. కమలహాసన్ కోసం రామ్ చరణ్ సినిమాను శంకర్ పక్కన పెట్టబోతున్నాడని సమాచారం.శంకర్ ఉన్నట్టుండి రాంచరణ్ సినిమాను వాయిదా వేయడానికి కారణం కూడా ఇంకొకటుంది. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో షూటింగ్ ఆగిపోవడమే అని సమాచారం. ఇక్కడ నిర్మాతలు తీసుకున్న నిర్ణయం కారణంగానే శంకర్ కమలహాసన్ తో ఇండియన్ 2 సినిమాను మొదలుపెట్టబోతున్నారట.

కేవలం రెండు వారాలు పాటు చిత్రీకరణ జరపబోతున్నారని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయగా..ఇక అందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని నటిస్తోంది అని అందరికీ తెలిసిందే. ఇక శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సిటిజన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version