మ‌హేష్‌తో సినిమా టైం వేస్ట్‌… ఆ ద‌ర్శ‌కుడు షాకింగ్ డెసిష‌న్‌

-

సూపర్ స్టార్ మహేష్‌బాబుతో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు పెద్ద టాస్కే. మ‌హేష్‌తో సినిమా ఓకే చేయించుకునేందుకు క‌థ‌తో మెప్పించాలి… ఆ త‌ర్వాత బ‌డ్జెట్‌, రెమ్యున‌రేష‌న్ ఇలా చాలా రిస్క్‌లే ఉంటాయి. ఇటీవ‌ల మ‌హేష్ సినిమాల‌ను చూస్తే క‌థ‌తో మ‌హేష్‌ను మెప్పించ‌డ‌మే కాకుండా మిగిలిన విష‌యాల్లో కూడా అత‌డితో సినిమాలు చేస్తోన్న ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఇబ్బంది ప‌డ‌క త‌ప్ప‌డం లేదంటున్నారు.


ఇటీవ‌ల మ‌హేష్‌బాబు హిట్టు ఉన్న ద‌ర్శ‌కుల‌కే ఛాన్సులు ఇస్తున్నార‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో బాగా ఉంది. అంతెందుకు పూరి జ‌గన్నాథ్ ఈ విష‌యాన్ని ఓపెన్‌గానే చెప్పేసి మ‌హేష్‌కు షాక్ ఇచ్చేశాడు. ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ అయ్యాక మ‌హేష్‌తో సినిమా చేస్తారా ? అని ప్ర‌శ్నిస్తే త‌న‌కు ఓ క్యారెక్ట‌ర్ ఉంటుంది క‌దా ? అని రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చాడు.

ఇక కొద్ది రోజుల క్రితం సుకుమార్ కూడా మ‌హేష్‌తో సినిమాకు ప్లాన్ చేశాడు. మ‌హేష్ చాలా రోజులు వెయిట్ చేయించ‌డంతో చివ‌ర‌కు బ‌న్నీతో కమిట్ అయ్యాడ‌ని తెలుస్తోంది. ఇప్పుడు అదే క్రమంలో మరో దర్శకుడు కూడా మహేష్ తో సినిమా చేయాల్సి ఉన్నా టైం వేస్ట్ అనుకున్నాడో ఏమో కాని ఆ సినిమా కుదరదని వేరే ప్రయత్నాల్లో ఉన్నాడట. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు అర్జున్‌రెడ్డి సినిమాతో తెలుగులో ఓవ‌ర్‌నైట్ స్టార్ డైరెక్ట‌ర్ అయిన సందీప్‌రెడ్డి వంగ‌.

అర్జున్‌రెడ్డి త‌ర్వాతే వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా అనుకున్నారు. చివ‌ర‌కు సందీప్ అర్జున్‌రెడ్డిని హిందీలో క‌బీర్‌సింగ్ పేరుతో తీసి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు. ఆ సినిమా బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో సందీప్‌కు అక్క‌డే భారీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. అందుకే ఇప్పుడు మ‌హేష్‌ను బ‌తిమిలాడుకోవ‌డం క‌న్నా అక్క‌డే సినిమా చేయ‌డం బెట‌ర్ అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news