సింహాచలంలో అపశృతి : కూలిన ధ్వజస్తంభం

-

విశాఖ లోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నర సింహ స్వామి దేవ స్థానంలోని ఉపాలయం శ్రీ సీతారామ స్వామి సన్నిధిలోని ధ్వజ స్థంభం కూలిపోయింది. బుధవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా ఆలయంలోని ధ్వజస్థంభం కూలడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే సీసీ టీవీ పుటేజీ సహాయంతో ఈ ఘటన కారణాలపై పరిశీలించారు.

ఎవరి ప్రమేయం లేదని నిర్ధారించుకున్న అనంతరం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అతి పురాతనమైన ఈ ధ్వజ స్థంభం లోపలి భాగంలోని కర్ర పుచ్చి పోవడంతో.. అకస్మాత్తుగా కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఉదయం 6:30 గంటల సమయంలో జరిగినట్లు.. సీసీ టీవీ పుటేజీ పరిశీలన అనంతరం అధికారులు తెలిపారు. అనంతరం వేద మంత్రాలు, సంప్రోక్షణ తర్వాత తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ధ్వజస్థంభం ఏర్పాటు పనులు ప్రారంభించారు ఆలయ అధికారులు. పది రోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్థంభాన్ని ఏర్పాటు చేస్తామని సింహాచల దేవ స్థానం ఈవో సూర్యకళ మీడియాకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version