మైక్రోసాఫ్ట్ విండోస్‌ సేవలకు అంతరాయం..ఎలాన్ మస్క్ సెటైరికల్ ట్వీట్

-

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని పీసీల్లో విండోస్‌-11, 10లో ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో సమస్య ఏర్పడింది. బ్లూ స్క్రీన్‌ ఎర్రర్‌తో పీసీలు, ల్యాప్‌టాప్‌లు పలుమార్లు రీస్టార్ట్‌ అవుతున్నాయి. భారత్‌ సహా అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ సమస్య ఏర్పడింది. విండోస్‌లో సాంకేతిక సమస్య వల్ల విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈ క్రమమంలో కొన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు అమెరికాలోని ఫ్రాంటీయర్‌ సంస్థ ప్రకటించింది.

విండోస్‌లో సమస్యపై ‘ఎక్స్‌’ వేదికగా పోస్టులు యూజర్లు పోస్టులు పెడుతున్నారు. విండోస్‌లో సమస్య కారణంగా హైదరాబాద్‌లోనూ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో బ్లూ స్క్రీన్‌ ఎర్రర్‌పై మైక్రోసాఫ్ట్‌ స్పందించింది. అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్‌ ట్వీట్‌ చేసింది.

దీనిపై ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ స్పందించారు. మైక్రోసాఫ్ట్‌ కంటే మైక్రో హార్డ్ బెటర్ అంటూ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. ఈ రోజు అన్ని యాప్‌లు నిలిచిపోయినా.. ట్విట్టర్‌ మాత్రం పనిచేస్తుందంటూ ఎలాన్ మస్క్‌ మరో ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news