చెప్పిందే చేస్తాము చేసేదే చెబుతాము..మంత్రి శ్రీధర్ బాబు

-

రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమనీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. చెప్పిందే చేస్తాము చేసేదే చెబుతామనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మొదటి విడతలో లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేశామని తెలిపారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్ఎస్ నాయకుల మాటలు ఉన్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

రైతు ఆదాయం పెరగడానికి ఆయిల్ ఫామ్ సాగు తోడ్పడుతుందని,రూ.170 కోట్ల వ్యయంతో పెద్ద పల్లిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 250 మందికి ప్రతేక్షంగా 500మందికి పరోక్షంగా ఉపాధి పొందుతారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి టేలండ్ ప్రాంత రైతులకు నీరు అందిస్తామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news