యశోద ప్రొడ్యూసర్ నిర్మించిన సీరియల్ ఏంటో తెలుసా..?

-

యశోద సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. సమంత పై నమ్మకంతో భారీ బడ్జెట్ తో తెరకేక్కించిన ఈ సినిమా అంతకుమించి విజయాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది అని గతంలో మీడియా ముందు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈయన కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారే. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పవచ్చు. ప్రముఖ సీనియర్ నటుడు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

మేనమామ సహాయంతో నిర్మాతగా మారి శ్రీదేవి మూవీస్ బ్యానర్ ను ఏర్పాటు చేసి చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ వంటి నటులతో చిన్నోడు పెద్దోడు అనే సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాకి కూడా ఆయనే నిర్మాత కావడం గమనార్హం. ఈ చిత్రాలే కాకుండా వంశానికొక్కడు, అనగనగా ఒక అమ్మాయి, భలేవాడివి బాసు , ఊయల, జెంటిల్మెన్, సమ్మోహనం, మిత్రుడు వంటి సినిమాలను కూడా తీశారు. దాదాపు ఈయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా మంచి లాభార్జన అందించాయి. నిర్మాణం మాత్రమే కాకుండా పంపిణీ పనులు కూడా చేశారు. అలాగే లైన్ ప్రొడ్యూసర్ గా కొన్నాళ్లు పనిచేసిన ఈయన అసోసియేట్ ప్రొడ్యూసర్ గా మారి మరికొన్ని రోజులు పనిచేశారు.

చివరికి నిర్మాతగా సెటిల్ అయ్యి నేటికీ చిత్ర నిర్మాణం చేపడుతున్నారు. ఇవే కాకుండా టీవీ ఇండస్ట్రీకి వచ్చి 2012లో ముత్యమంత పసుపు అనే సీరియల్ ని కూడా నిర్మించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదుగుతూ వరుస విజయాలతో వెనుతిరిగి చూడకుండా దూసుకుపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news