ఓటీటీలో తాప్సీ ‘దొబారా’ సినిమా.. ఎప్పుడంటే..?

-

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది తాప్సీ పన్ను. వైవిధ్యమైన సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా  ‘దొబారా’. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకుడు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఓ యువతి చనిపోయిన అబ్బాయి ఆత్మతో మాట్లాడిన తర్వాత గతంలోకి వెళ్లి అతడి ప్రాణాలను ఎలా రక్షించిందన్నదే కథ. టైమ్‌ ట్రావెల్‌, డైమెన్షన్‌ అంశాలతో కథనం తీర్చిదిద్దారు. 2:12 సంఖ్యకు కథకు సంబంధం ఏంటనేది సస్పెన్స్‌.

స్పానిష్‌లో విడుదలైన ‘మిరాజ్‌’ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ఏక్తాకపూర్‌ ‘కల్ట్‌ మూవీస్‌’, సునీర్‌ ఖేత్రాపాల్‌ ‘అథీనా’ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సుమారు రూ.30కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.7కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version