“డబుల్ ఇస్మార్ట్” లో KGF విలన్ కు భారీగా పారితోషికం … !

-

రామ్ మరియు పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో గతంలో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ తర్వాత పూరి జగన్నాధ్ మళ్ళీ హిట్ బాట పట్టాడని ఇండస్ట్రీ అంతా అనుకుంది. కానీ గత సంవత్సరం విజయ్ దేవరకొండతో తీసిన “లైగర్” సినిమా డిజాస్టర్ కావడంతో చాలా వివాదాలలో చిక్కుకున్నాడు. దానితో మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కించే పనిలో పడ్డాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. గత సంవత్సరం కెజిఎఫ్ 2 లో నటించి మంచి పేరు తెచ్చుకోవడంతో తన గ్రాఫ్ అలా పెరిగిపోయింది. కాగా ఈ సినిమా షూటింగ్ లో భాగంగా సంజయ్ దత్ దాదాపుగా 60 రోజుల పాటు ఉండాలి ఉంది. అందుకు గాను పారితోషికంగా 5 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదటి షెడ్యూల్ పూర్తి కాగా , రెండవ షెడ్యూల్ త్వరలోనే విదేశాల్లో స్టార్ట్ కానుంది.

కాగా ఈ సినిమాపై పూరి జగన్నాధ్ ఎన్నో ఆశలను పెట్టుకున్నాడు, ఇక రామ్ బోయపాటి డైరెక్షన్ లో స్కంద సినిమా షూటింగ్ లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news