దేశ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. వ్యవసాయ రుణాలపై రైతులకు అందించే వడ్డీ రాయితీ పథకాన్ని… కేంద్ర ప్రభుత్వం యధావిధిగా కొనసాగించబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల…. చేసింది. ఇందుకోసం 15,642 కోట్లు కేటాయించింది మోడీ ప్రభుత్వం. పంట సాగు కోసం మూడు లక్షల వరకు ఇవ్వనుంది.

అదే సమయంలో అనుబంధ కార్యకలాపాల కోసం రెండు లక్షల రుణం తీసుకోవచ్చును రైతులు. ఏడు శాతం వడ్డీతో తీసుకునే రుణాలను సకాలంలో చెల్లిస్తే… మూడు శాతం రాయితీ అందిస్తారు. ఈ మూడు శాతం లో బ్యాంకు 1.5% భరిస్తుంది. అంటే రుణాలు తీసుకునే రైతులకు నాలుగు శాతంతోనే రుణాలు వస్తాయన్నమాట. ఇక ఈ సబ్సిడీ రుణాలకు అన్ని బ్యాంకుల్లో మనం అప్లై చేసుకోవచ్చు.