డ్రగ్స్ కేసు: దీపికా పదుకునే సెల్ ఫోన్ సీజ్

-

బాలీవుడ్‌–డ్రగ్స్‌ సంబంధాలపై విచారణలో భాగంగా హీరోయిన్‌ దీపికా పదుకునే శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ముందు విచారణకు హాజరైంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి అనేక అంశాలపై అధికారులు విచారించారు. అయితే విచారణ సందర్భంగా దీపిక చెప్పిన సమాధానాలతో ఎన్సీబీ అధికారులు అసంతృప్తికి గురయ్యారు. ఈ కేసులో కీలకంగా ఉన్న కరిష్మా ప్రకాశ్ తో తనకు సాధారణ సంబంధాలే తప్ప డ్రగ్స్ సంబంధాలు లేవని దీపిక తెలిపింది. అయితే ఎన్సీబీ అధికారులు ఆమె వాదనలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కరిష్మా ప్రకాశ్ చెప్పిన వివరాల ప్రకారం తమ డ్రగ్స్ గ్రూపులో దీపికనే కీలకమని ఆమె గ్రూప్ అడ్మిన్ అని తెలిపినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఆమె ఫోనును అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్‌ కేసులో దీపికతో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఇప్పటికే ప్రశ్నించిన అధికారులు ప్రస్తుతం సాహో భామ శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news