BREAKING : హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు లక్ష్మీపతి అరెస్ట్ !

-

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్టు అయ్యాడు. ఆంధ్ర లో లక్ష్మీపతిని అదుపులోకి తీసుకుంది హెచ్ న్యూ వింగ్. హైదరాబాద్ డ్రగ్ కేసులో లక్ష్మీపతి కోసం ఐదు రోజులుగా గాలించిన పోలీసులకు… ఇవాళ ఏపీలో అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ విద్యార్థి మృతిలో కీలక సూత్రధారిగా లక్ష్మీపతి ఉన్నాడు.

ఏడేళ్లుగా గంజాయికి బానిసైన లక్ష్మీపతి.. బీటెక్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయికి అలవాటు పడ్డాడు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయి, డ్రగ్స్ అమ్మిన లక్ష్మీపతి.. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆశిష్ ఆయిల్ తెచ్చి అమ్మడం మొదలు పెట్టాడు. రూ.లక్షకు లీటర్ ఆశిష్ ఆయిల్ కొనుగోలు చేసిన లక్ష్మీపతి.. హైదరాబాద్‌లో లీటర్ ఆశిష్ ఆయిల్‌ని రూ. 8లక్షలకు అమ్మడం మొదలు పెట్టాడు. ప్రేమ్‌ కుమార్, లక్ష్మీపతి కలిసి డ్రగ్స్ అమ్మకాలు కొనసాగించాడు. గోవా పట్టణం  నుంచి డ్రగ్స్ పాకెట్లను  తెచ్చి విద్యార్థు లకు అమ్ముతున్న లక్ష్మీపతి.. ఈ నేపథ్యంలోనే బీటెక్ విద్యార్థి మృతికి కారణం అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news