ఆఫ్గనిస్తాన్ టూ విజయవాడ..జోరుగా డ్రగ్స్ సరఫరా..!

-

గుజరాత్ ముంద్రా పోర్టులో 2,988 కే.జి ముడిసరకు గల హెరాయిన్ ను పోలీసులు అధికారులు పట్టుకున్నారు. ఆఫ్గాన్ నుండి ఇండియాకు రెండు కంటైనర్లలో హెరాయన్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. కాందహార్ నుంచి టాల్కం పౌడర్ పేరిట కంటెనర్లలో రవాణా జరుగుతున్నట్టు నిర్దారించారు.
డెలివరీ అడ్రస్ లో విజయవాడ సత్యనారాయణ పురం చిరునామా ఉండటం కలకలం రేపుతోంది. ఆషీ ట్రేడింగ్స్ పేరుతో విజయవాడ సత్యనారాయణ పురంలో కంపెనీ రిజిష్టర్ అయ్యింది. ఏడాది క్రితం గోవింద రాజు పేరుతో ఈ కంపెనీ రిజిస్టర్ అయ్యింది.

రిజిస్ట్రేషన్ వివరాల్లో చెన్నైలో నివాసం ఉంటున్న సుదాకర్‌ అనే మరో వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా ఉన్నట్టు గుర్తించారు. హెరాయిన్ పట్టుకున్న తరవాత స్వీచాఫ్ అయిన సుధాకర్ ఫోన్. దాంతో డిఆర్ ఐ, నార్కొటిక్స్ అధికారులు కూపీ లాగుతున్నారు. మూడు రోజుల క్రితం గోవింద రాజు, అతని భార్య ను చెన్నై లో అధికారులు అరెస్ట్ చేశారు. గోవిందరాజు నివాసంలో నిన్న డి. ఆర్.ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అత్యంత రహస్యం గా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఆఫ్గనిస్తాన్ నుండి విజయవాడ కు ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news