BREAKING : ఇవాళ బుద్వేల్ లోని 100 ఎకరాలకు ఈ-వేలం..ఒక్క ఎకరం రూ.20 కోట్లపైనే !

-

BREAKING : ఇవాళ మరో 100 ఎకరాలకు ఈ-వేలం నిర్వహించనుంది హెచ్‌ఎండీఏ. ఈ రోజు రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లోని 100 ఎకరాలకు ఈ-వేలం నిర్వహించనుంది హెచ్ఎండీఏ. 14 ల్యాండ్ పార్శిల్స్ కు వేలం జరుగనుంది. ఇప్పటికే కోకాపేట్ లో ఎకరా 100 కోట్లు దాటింది ధర.

నిన్నటికే దరావతు చెల్లించడానికి ఆఖరి రోజు అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి సెషన్ ఉ. 11 నుండి మ.2 వరకు..రెండో సెషన్ మ. 3 నుండి సా.6 వరకు వేలం జరుగనుంది. ఇక బుద్వేల్‌లో కనిష్ట నిర్దేశిత ధర ఎకరా 20 కోట్లు గా ఉంది. వేలం పెంపు కనీసం 25 లక్షలుగా నిర్ణయించింది హెచ్ఎండీఏ. ఈ లెక్కన కనీసం 3 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది హెచ్‌ఎండీఏ.

Read more RELATED
Recommended to you

Latest news