ప్ర‌తి ప‌దం మీ ఆత్మ ను సూచిస్తుంది : సిరివెన్నెల చివ‌రి పాటపై సాయిప‌ల్ల‌వి

-

సిరి వెన్నెల సీతారామా శాస్త్రి ఇటీవ‌ల అనారోగ్యం తో మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న చివ‌ర గా పాడిన పాట ప్ర‌స్తుతం ఫుల్ వైర‌ల్ అవుతుంది. నేచుర‌ల్ స్టార్ నాని, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర లో వ‌స్తున్న శ్యామ్ సింగరాయ్ అనే సినిమా కు సిరి వెన్నెల సీతా రామా శాస్త్రి చివ‌ర గా పాట పాడారు. ఈ పాట ను ఇటీవ‌ల శ్యామ్ సింగ రాయ్ చిత్ర బృందం విడుద‌ల చేసింది.

ఈ పాట పై ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది సెల‌బ్రెటీలు స్పందించారు. ఈ పాట తో మ‌ళ్లి సిరి వెన్నెల గుర్తు కు వ‌స్తున్నార‌ని సెలబ్రెటీలు కామెంట్ చేశారు. తాజా గా హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి కూడా ఈ పాట పై స్పందించారు. ఈ పాట పై సాయి ప‌ల్ల‌వి స్పంద‌న‌ను ట్విట్ట‌ర్ వేదిక గా తెలిపింది. మీరు రాసిన ప్ర‌తి ప‌దం మీ ఆత్మ ను సూచిస్తుంది. అని అన్నారు. అలాగే మీరు ఎప్ప‌టికీ మా హృద‌యాల్లో జీవించే ఉంటారు సార్ అని సాయి ప‌ల్ల‌వి కామెంట్ చేసింది. కాగ రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా కు.. మిక్కి జే. మేయ‌ర్ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news