పవన్, బాబు కుట్రలపై ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలి : మంత్రి రోజా

-

సినీనటి ,మంత్రి రోజా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాదరణ చూసి ఓర్వలేకే సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు దాడి చేయించారని మంత్రి రోజా ఆరోపించారు. సీఎంపై దాడికి నిరసనగా పుత్తూరులో ఆమె రోడ్డుపై బైఠాయించారు. ‘పవన్, బాబు కుట్రలపై ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలి అని,వారిపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు. దాడి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో పోలీసులు తేల్చాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, నిన్న విజయవాడలో సీఎం జగన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటి దగ్గర గాయమైంది.రాయి బలంగా తగలడంతో కన్ను వాచింది. CMRF హరికృష్ణ గారు ఫస్ట్ ఎయిడ్ చేశారు .ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version