లిక్కర్ స్కాం డబ్బు ద్వారా ల్యాండ్ కొనుగోలు: ఈడీ సంచలనం

-

ఢిల్లీ లిక్కర్ స్కాం ఎంత సంచలనం సృష్టించిందో మనము చూశాము. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని విచారించి సీబీఐ మరియు ఈడీ లు కొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసు గురించి ఈడీ సంచలన విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఈ కేసులో మూడవ ఛార్జ్ షీట్ ను కోర్ట్ లో వేసిన ఈడి పేర్కొంది. ఈ ఛార్జ్ షీట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత, కవిత భర్త అనిల్, అరుణ్ పిళ్ళై ల పేర్లు మీద భూములను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఈ కేసులో వందల కోట్లు ముడుపులు జరిగినట్లు ఆధారాలను బట్టబయలు చేశారు.

ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అరుణ్ పిళ్ళై ఖాతా నుండి జరిగినట్లు ఈడి అధికారులు గుర్తించారు. ఇలా దక్కిన డబ్బుతో తమ రాజకీయ బలంతో తక్కువ ధరకే ఎంతో విలువైన భూములు కొనుగోలు చేశారని ఈడి తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version