బీజేపీ అధికారంలోకి వస్తే.. పేదలకు భూమి, ఇళ్లు ఇస్తాం : ఈటల

-

ఖమ్మం వేదికగా జరుగుతున్న “రైతు ఘోష – బీజేపీ భరోసా” బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు భరోసా ఇచ్చేందుకే అమిత్‌షా ఖమ్మం పర్యటనకు వచ్చారని చెప్పారు. ఖమ్మం వేదికగా జరుగుతున్న “రైతు ఘోష – బీజేపీ భరోసా” బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు భరోసా ఇచ్చేందుకే అమిత్‌షా ఖమ్మం పర్యటనకు వచ్చారని చెప్పారు.

రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తామని చెప్పిన కేసీఆర్ అన్ని బంద్ చేశారన్నారు. టాక్టర్లపై సబ్సిడీ ఎత్తివేశారని, డ్రిప్ ఇరిగేషన్ లేదని, రైతులు పంట అమ్ముకోవాలంటే వారం పాటు పడిగాపులు కాయాల్సిన పడాల్సిన పరిస్థితి నెలకొందని ఈటల రాజేందర్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతులు పండించిన ప్రతి గింజను కొంటామన్నారు. రైతులకు ఇవ్వాల్సిన అన్ని సబ్సిడీలు ఇస్తామన్నారు. తెలంగాణలో పేదలకు ఇప్పటికీ సొంత ఇంటి కల నెరవేరలేదని చెపపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version