చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం : మంత్రి కారుమూరి

-

ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కారుమూరి అన్నారు.అడిగి అడిగి ధాన్యం కొన్నామన్న ఆయన చివరి గింజ వరకు కొంటామని తెలిపారు..టిడిపి పాలనలో రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే తాము 3.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు.ఈ మేరకు నాలుగు రోజుల్లోనే డబ్బులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసామని పేర్కొన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేశామని తెలిపారు.కానీ ప్రతిపక్ష నేతలు కుట్రపూరితంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సీఎం జగన్ తమకు మేలు చేశారని రైతులు కొనియాడుతున్నారని మంత్రి తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. లోకేష్ అసలు మనిషేనా అంటూ మండిపడ్డ మంత్రి.. కేసులు పెట్టించుకోమని చెప్పే హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఇది చాలా దుర్మార్గమన్నారు. కొడాలి నాని చిటికెన వేలు మీద ఈక కూడా పీకలేవు లోకేష్ అంటూ మంత్రి మండిపడ్డారు. ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version