Telangana: రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

-

Telangana: రేపటితో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచా రానికి ఓరుగల్లు కు పోటెత్తుతున్నారు అగ్ర నేతలు,ముఖ్య నేతలు. టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీ అభ్యర్థుల కోసం ముఖ్యనేతల సుడిగాలి పర్యటనలు కొనసాగుతున్నాయి.

Telangana Graduate MLC By Election 2024,Graduate MLC Election 2024

పోలింగ్ కు మరో మూడు రోజులే మిగిలి ఉండడంతో జోరందుకున్నాయి ప్రలోభాలు. అగ్ర పార్టీల ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తు, నియోజకవర్గాలు, మండలాలు గ్రామాల, వారీగా కెడర్ ను కలిసి అభ్యర్థుల గెలుపునకు మద్దతు కూడగడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది బరిలో ఉండగా ఈనెల 27న పోలింగ్ జరగనుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఏనుగుల రాకేష్‌ రెడ్డి, బీజేపీ పార్టీ తరఫున ప్రేమేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తరఫున తీన్మార్‌ మల్లన్న బరిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news